Share News

Sajjala: మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు

ABN , Publish Date - May 14 , 2025 | 06:52 PM

లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు.

Sajjala: మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు
Sajjala Sridhar Reddy

Sajjala Sridhar Reddy: విజయవాడ: లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో రేపు అంటే, ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్యం స్కాం లో‌ కీలకంగా పని‌చేసిన సజ్జల శ్రీధర్ రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్న సిట్ అధికారులు ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కస్టడీ అనుమతి పొందారు.

ఇలా ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఏసీబీ కోర్టులో మే 12 సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీధర్‌రెడ్డి నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఇవాళ కస్టడీకి ఇచ్చింది కోర్టు.

మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) దిలీప్‌ ఏసీబీ కోర్టులో సోమవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో దిలీప్‌ ఏ-30గా ఉన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసును ఈ నెల 15కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


గులకరాయి కథ నిజం చేసిన కాకి

Updated Date - May 14 , 2025 | 06:52 PM