CBN Book: ద సీబీఎన్ వే పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:04 AM
సీఎం చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పసలపూడి సత్యేంద్ర రచించిన ‘ద సీబీఎన్ వే’ పుస్తకాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఐటీ, ఈ-గవర్నెన్స్, విద్యా సంస్కరణలు, విజన్ 2047 గురించి పుస్తకం వివరిస్తుంది.
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఇన్ఫోలోబ్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పసలపూడి సత్యేంద్ర రచించిన ‘ద సీబీఎన్ వే.. ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్’ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించారు. చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయన విద్యాభ్యాసం, రాజకీ య నేపథ్యం, ఐటీ పాలసీ, ఈ-గవర్నెన్స్, విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, వృద్ధిరేటు పెరుగుదలకు తీసుకున్న చర్యలు, విజన్ 2047 వంటి వాటి గురించి ఈ పుస్తకంలో వివరించారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ కంపెనీల కారణంగా తాను హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం సాధించానని, అవకాశాలను అందిపుచ్చుకుని మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగానని కాకినాడకు చెందిన సత్యేంద్ర తెలిపారు.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News