Modi Felicitation: ధర్మవరం శాలువా బందరు కళారూపం
ABN , Publish Date - May 03 , 2025 | 05:16 AM
ప్రధాని మోదీని ధర్మవరం శాలువాతో సీఎం చంద్రబాబు సన్మానించారు. అలాగే, మచిలీపట్నం కళాకారులు రూపొందించిన మోదీ చిత్రంతో కూడిన కళారూపం ఆయనకు బహుకరించబడింది
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): అమరావతి సభా వేదికపై ప్రధాని మోదీని ధర్మవరం శాలువాతో సీఎం చంద్రబాబు సన్మానించారు. అలాగే సిల్క్ ఫ్యాబ్రిక్పై సహజ రంగులను వినియోగించి ఫ్రీ హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్తో ఐకానిక్ అమరావతి టవర్, ప్రధాని మోదీ చిత్రంతో రూపొందించిన కళారూపాన్ని కూడా బహుకరించారు. తన చిత్రంతో ఉన్న బహుమతిని చూసి మోదీ అచ్చెరువొందారు. మచిలీపట్నానికి చెందిన కళాకారులు ఈ కళాకృతిని రూపొందించారు. అంతకుముందు తిరుమల నుంచి వచ్చిన అర్చకులు మోదీకి ఆశీర్వచనం అందించారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్