Solar Energy: టారిఫ్ ను సవరించం
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:31 AM
కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (CERC) తెలిపిన ప్రకారం, SECI మరియు ఏపీ డిస్కమ్ల మధ్య కుదిరిన రూ.2.49 టారిఫ్ను మారుస్తుండటం సాధ్యం కాదు. అదానీ, అజూర్ కంపెనీలతో కూడిన ఒప్పందాల నేపథ్యంలో టారిఫ్ పెంపు అభ్యర్థనను మండలి తిరస్కరించింది.
యూనిట్ రూ.2.49కు ఇవ్వాల్సిందే
సెకీకి కేంద్ర విద్యుత్ మండలి స్పష్టీకరణ
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)కి, ఏపీ డిస్కమ్లకు మధ్య ఖరారైన టారి్ఫను సవరించడం కుదరదని కేంద్ర విద్యుత్ నియంత్రణమండలి (సీఈఆర్సీ) తేల్చిచెప్పింది. ఏపీ డిస్కమ్లతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.2.49కు యూనిట్ విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని, ఆ ధరను పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఏపీకి 7వేల మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేలా డిస్కమ్లతో సెకీ ఒప్పందం చేసుకుంది. ఇందులో 4,667 మెగవాట్ల కోసం అదానీతోను, 2,333మెగావాట్ల కోసం అజూర్తోను అనుబంధ ఒప్పందాలు చేసుకుంది. అజూర్తో అదానీ కంపెనీ 2,333 మెగావాట్ల విద్యుత్ కోసం వేరే ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం రద్దు అయిన దరిమిలా గతంలో కుదిరిన టారిఫ్ ధరను పెంచాలంటూ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలిని సెకీ ఆశ్రయించింది. దీనిపై గురువారం మండలి తన నిర్ణయం తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News