MLA: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:07 AM
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ఇచ్చిన పలు హామీలు నెరవేర్చిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా వారు బుధ వారం మండలంలోని కసముద్రం గ్రామంలో పర్యటించారు.

- ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
అమడగూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ఇచ్చిన పలు హామీలు నెరవేర్చిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా వారు బుధ వారం మండలంలోని కసముద్రం గ్రామంలో పర్యటించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మేరకు ప్రస్తుతం ప్రభుత్వం యేడాదిలో నెరవేర్చిన హామీలను, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోపాల్రెడ్డి, నాయకులు కమ్మల భాస్కర్, కుమార్రెడ్డి, రమణారెడ్డి, రోహిత రెడ్డి, ఈశ్వరయ్య, జయప్ప, టైలర్ రమణ, నాగరాజు, రాము, నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి గురువా రం మండలంలోని తుమ్మలకుంటపల్లి పంచాయతీలో పర్య టించ నున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి తెలిపారు. సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....