RALLY: త్రివర్ణ పతాకంతో ర్యాలీ
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:26 AM
మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు.
అమడగూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో గురువారం వెలుగు సంఘాల అమృత మండల సమాఖ్య ఆధ్వర్యంలో త్రివర్ణపతాక ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగుతూ, మండలంలోని అన్ని పంచాయతీల్లో డీఆర్డీఏ వెలుగు సిబ్బందితో కలిసి నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు హరి, వెంకటరమణ, శంకర్నాయక్, రామాంజనప్ప, సమాఖ్య లీడర్లు మునిరత్నమ్మ, సభ్యులున్నారు.