Pawan Kalyan On Anantapuram: ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది..
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:52 PM
ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించామని గుర్తు చేశారు.
Also Read:
డిప్యూటీ సీఎం ఫొటోపై పిటిషన్.. కొట్టివేసిన హైకోర్ట్
జార్ఖండ్లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్