MAGISTRATE: హింసను నివారించాల్సిన బాధ్యత అందరిది
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:53 PM
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.
న్యాయాధికారులు
ధర్మవరం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... . మహిళలపై హింస అనేది మానవహక్కుల ఉల్లంఘన అని అందరూ తెలుసుకో వాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే దాడులు, లైంగిక వేధింపుల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి, సుమలత, సిబ్బంది పాల్గొన్నారు.