PR: పంచాయతీరాజ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:17 AM
పంచాయతీ రాజ్ ఉద్యోగుల యూనియన ధర్మవరం తాలుకా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ యూనియన జిల్లా నాయకులు విజయ శేఖర్ నాయుడు, శ్రీని వాసుల తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో ఆదివారం ఆ యూనియన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్న ట్లు తెలిపారు. తాలూకా అధ్యక్షుడిగా తాడిమర్రి ఎంపీడీఓ కార్యా లయం జూనియర్ అసిస్టెంటు అక్కిం ప్రతాప్ను ఎన్నుకున్నారు.
బత్తలపల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ రాజ్ ఉద్యోగుల యూనియన ధర్మవరం తాలుకా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ యూనియన జిల్లా నాయకులు విజయ శేఖర్ నాయుడు, శ్రీని వాసుల తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో ఆదివారం ఆ యూనియన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్న ట్లు తెలిపారు. తాలూకా అధ్యక్షుడిగా తాడిమర్రి ఎంపీడీఓ కార్యా లయం జూనియర్ అసిస్టెంటు అక్కిం ప్రతాప్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షు రాలిగా కరుణకుమారి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసు లు, కోశాధికారిగా సుదర్శనరెడ్డి, ఈసీ నెంబర్లుగా గోపాలక్రిష్ణ, అబ్దుల్ నబీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికైన కమిటీని యూనియననాయకులు గంధం శ్రీనివాసులు, మల్లికార్జున, హరిబాబు, విజయభాస్కర్రెడ్డి, అల్లాబకాష్ అభినందించారు.
వీఆర్ఏల మండల కమిటీ ఎన్నిక
వీఆర్ఏల సంఘం బత్తలపల్లిమండ ల కమిటీని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు నరసింహులు తెలిపారు. మండలంలోని వీఆర్ఏలు స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో ఆదివారం సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా నరసింహులు, ఉపాధ్యక్షుడిగా రాజ, ప్రధాన కార్యదర్శి గా రాంప్రసాద్, కోశాధికారిగా నారా యణస్వామిని ఎన్నుకున్నారు. ఈసీ నెంబర్లుగా శివశంకర్, రామాంజనేయులు, గంగనారమ్మ, బా బు, రామాంజినేయులు, నాగార్జున, నారాయణ, లక్ష్మీనరసమ్మను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఎంపికైన వారిని సన్మానించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....