సరైన సమయంలో సరైన చర్యలు: ఖర్గే

ABN, Publish Date - Jun 06 , 2024 | 09:34 AM

న్యూఢిల్లీ: తమను బీజేపీ ప్రభుత్వం పాలించవద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

న్యూఢిల్లీ: తమను బీజేపీ ప్రభుత్వం పాలించవద్దని దేశ ప్రజానీకం కోరుకున్నారని, వారి ఆకాంక్షను నెరవేర్చటానికి సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల్లో దేశప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బీజేపీకి మెజారిటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బుధవారం ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. తమ కూటమికి ప్రజలు మద్దతు పలికారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

వైసీపీలో కలకలం

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 06 , 2024 | 09:34 AM