పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని..

ABN, Publish Date - Sep 19 , 2024 | 01:15 PM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని.. పవన్‌తో సమావేశం కానున్నారు. చర్చల అనంతరం బాలినేని చేసిన ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని.. పవన్‌తో సమావేశం కానున్నారు. చర్చల అనంతరం బాలినేని చేసిన ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీలో కోటరీ రాజ్యం నడుస్తోందని.. తనను నిర్లక్ష్యం చేశారని బాలినేని ఆరోపించారు. ఇదొక్కటే కాకుండా తాను పార్టీ వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని బాలినేని చెప్పుకొచ్చారు. మరోవైపు.. తాను జనసేన అధినేత పవన్‌తో గురువారం భేటీ అవుతానని.. ఆ తరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. పవన్‌తో భేటీ తరువాత ఆయన జనసేనలో చేరుతారా? మరేం ప్రకటన చేస్తారో అనే ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీలో అవినీతిపై సీఎంకు ఫిర్యాదు..

టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిల

‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్‌ ఆవిష్కరణ

ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..

కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 19 , 2024 | 01:15 PM