గోదావరి ఉగ్రరూపం.. పెరుగుతున్న వరద..

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:55 PM

రాజమండ్రి: ఎడతెరిపి లేకుండా కురుస్తు్న్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.44.20 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద 9,84,082 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

భద్రాచలం కొత్తగూడెం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.44.20 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద 9,84,082 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇటు దిగువన ధవేళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. 9 అడుగులకు పెరిగిన నీటి మట్టం.. 175 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు, శబరి పొంగడంతో గోదావరికి వరద మరింత పెరగనుంది. రానున్న 48 గంటల్లో భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

బుడమేరు సక్సెస్.. ఫలించిన కష్టం..

వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారు?

బీజేపీలో చేరే ప్లాన్‌లో మాఫియా డాన్‌..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 10 , 2024 | 12:55 PM