కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ABN, Publish Date - Sep 09 , 2024 | 09:57 AM

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్‌లోని మూడు బెటాలియన్లు, బీహార్‌లోని ఒక పఠాలానికి చెందిన సీఆర్ఫీఎఫ్ బలగాలను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌కు తరలించాలని నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్‌లోని మూడు బెటాలియన్లు, బీహార్‌లోని ఒక పఠాలానికి చెందిన సీఆర్ఫీఎఫ్ బలగాలను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌కు తరలించాలని నిర్ణయించింది. ఈ నాలుగు బెటాలియన్లకు చెందిన సుమారు 4 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఇప్పటికే 40కు పైగా ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేసుకుని యాంటీ నక్సల్స్ ఆపరేషణ్‌లలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో కలిసి ఆపరేషన్ ప్రహార్లలో పాల్గొంటున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టులకు కంచుకోటగా బస్తర్ రీజియన్‌లోని 10 జిల్లాలు ఉండేవి. గడచిన నాలుగేళ్లలో ఆ సంఖ్య ఏడు జిల్లాలకు పరిమితమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు..

ప్రకాశం బ్యారేజీపై కుట్ర.. ప్రభుత్వానికి పోలీసులు నివేదిక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 09 , 2024 | 09:57 AM