కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 09 , 2024 | 08:56 AM
విజయవాడ: వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురుపట్టి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండగా.. రానున్న 48 గంటలపాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు..
విజయవాడ: వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురుపట్టి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండగా.. రానున్న 48 గంటలపాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్టు ప్రకటించారు. ఏపీ, ఒడిషా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుండడంతో కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కలకలం రేగుగోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వాగులు, వంకలు, కాలువలు, చెరువుల్లో పూడిక తీయడంగానీ, కనీసం మరమ్మత్తులుగానీ చేయలేదు. పైగా గత వైసీపీ ప్రభుత్వ అండతో వాగులు, చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయి. దీని ఫలితమే బడమేరులో వరద పోటెత్తడానికి కారణం. అందుకే వాయుగుండం అనగానే ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు..
ప్రకాశం బ్యారేజీపై కుట్ర.. ప్రభుత్వానికి పోలీసులు నివేదిక..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 09 , 2024 | 08:56 AM