ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట..

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:56 PM

అమరావతి: ఏపీ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. నంద్యాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే (అప్పటి ఎమ్మెల్యే) రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం ప్రచారం చేశారు.

అమరావతి: ఏపీ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. నంద్యాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే (అప్పటి ఎమ్మెల్యే) రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కూడా నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రచారం చేసి, పెద్ద ర్యాలీ నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేసు నమోదు చేయాలని అప్పటి ఎన్నికల కమిషన్ ఆదేశించాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.


తనపై నమోదైన కేసును కొట్టివేయాలని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేశారని తన ఫిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఫిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం... కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత అరెస్టు..

ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించిన కేటీఆర్

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు..

అమెరికా ప్రజల తీర్పు ఇదేనా ..

ఫలితాలు తారుమారు.. ట్రంప్‌కి బిగ్ షాక్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 06 , 2024 | 01:56 PM