జిల్లాల పర్యటనకు డిప్యూటీ సీఎం శ్రీకారం
ABN, Publish Date - Aug 22 , 2024 | 09:10 AM
అమరావతి: జిల్లాల పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం (23వ తేదీ) అన్నమయ్య జిల్లాలో తొలి గ్రామ సభలో పవన్ పాల్గొననున్నారు. ఆయన రాకతో మైసూరు వారి పల్లెలో సందడి వాతావరణం నెలకొంది.
అమరావతి: జిల్లాల పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం (23వ తేదీ) అన్నమయ్య జిల్లాలో తొలి గ్రామ సభలో పవన్ పాల్గొననున్నారు. ఆయన రాకతో మైసూరు వారి పల్లెలో సందడి వాతావరణం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు జరగనున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ మైసూరు వారి పల్లెను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు జరగనున్నాయి. ఈ సభలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరులోని మైసూరు వారి పల్లెలో జరిగే గ్రామ సభలో పాల్గొననున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పవన్ మైసూరు వారి పల్లెలో పర్యటించనుండడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారతి సిమెంట్లో భారీ కుంభకోణం..
ఆ కేసులో వైసీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 22 , 2024 | 09:10 AM