TS News: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:02 AM
Telangana: జిల్లాలోని ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గించారని ఆరోపిస్తూ ధర్నాకు రైతులు ధర్నాకు దిగారు. మొన్నటి వరకు రూ.25 వేలు పలికిన వండర్ హాట్ రకాన్ని రూ.15000లకే ఖరీదు చేశారని మండిపడ్డారు.
వరంగల్: జిల్లాలోని ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గించారని ఆరోపిస్తూ ధర్నాకు రైతులు ధర్నాకు దిగారు. మొన్నటి వరకు రూ.25 వేలు పలికిన వండర్ హాట్ రకాన్ని రూ.15000లకే ఖరీదు చేశారని మండిపడ్డారు. 15 వేలు అమ్మే 1048, 5531 రకం మిర్చిని రూ.8 వేలకు, తేజా రకం రూ.20వేలు ఉండగా రూ.12 వేలకు ఖరీదు చేస్తున్నారంటూ అన్నదాతలు ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో ఎనుమాముల మార్కెట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మిర్చి ధర పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల ధర్నా కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..