Share News

TS News: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడి హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:29 AM

Telangana: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడి హఠాన్మరణం కలకలం రేపింది. శనివారం 2వ నెంబర్ ఫ్లాట్ ఫారంపై వంగూరి రాంబాబు (30) అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

TS News: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడి హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

మహబూబాబాద్,జనవరి 6: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడి హఠాన్మరణం కలకలం రేపింది. శనివారం ఉదయం 2వ నెంబర్ ఫ్లాట్ ఫారంపై వంగూరి రాంబాబు (30) అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. రాంబాబు కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి సమాచారాన్ని రాంబాబు కుటుంబసభ్యులకు తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 06 , 2024 | 11:29 AM