Kishan Reddy: వేయిస్తంభాల గుడిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 09:04 AM
వరంగల్ జిల్లా: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వరంగల్ జిల్లా: మహాశివరాత్రి (MahaShivaratri) పర్వదినం సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) శుక్రవారం ఉదయం వరంగల్ (Warangal)లోని వేయిస్తంభాల గుడిలో శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడిలోని పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. 18 సంవత్సరాల తర్వాత వేయిస్తంభాల కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. కళ్యాణ మండపం పునరుద్ధరణ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తొలి కళ్యాణం నిర్వహించారు. 2006లో కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని తొలగించి... అధికారులు పునరుద్దరణ పనులు ప్రారంభించారు.