Share News

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య

ABN , Publish Date - Apr 02 , 2024 | 12:56 PM

వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో తమకు బీఆర్ఎస్‌తోనే పోటీ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పోటీలోనే లేదని, బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోమని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య వ్యాఖ్యానించారు.

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య

వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తమకు బీఆర్ఎస్‌ (BRS)తోనే పోటీ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) పోటీలోనే లేదని, బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోమని వరంగల్ (Warangal) కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) కడియం కావ్య (Kadiyam Kavya) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ.. తనకు ఎంపీ టికెట్ రావడంపై కాంగ్రెస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని.. ఎన్నికల్లో అందరినీ కలుపుకుని వెళ్తామని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెడతామని, వరంగల్ సమస్యలపై పోరాడతామని, సమగ్రమైన ఇండస్ట్రీస్ రావాలని కడియం కావ్య అన్నారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మరో లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్‌ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. కేవలం వరంగల్‌కు మాత్రమే ఖరారు చేసి మరో 3 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక కాగా, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించుకుని తండ్రితోపాటు కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాల విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తే.. కరీంనగర్‌ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే కరీంనగర్‌ నుంచి ఇప్పటివరకూ చర్చకు వచ్చిన బీసీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నేతల పేర్లను సీఈసీ భేటీలో నేతలు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరీంనగర్‌కు బీసీ అభ్యర్థి ఖరారైతే.. ఖమ్మం నుంచి రెడ్డి సామాజికవర్గం నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఖమ్మం రేసు నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తన భార్య నందిని పేరును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ రీత్యా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్‌ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 02 , 2024 | 12:59 PM