Share News

Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి సీఏం రేవంత్, భట్టి

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:21 AM

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది.

Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి సీఏం రేవంత్, భట్టి

హైదరాబాద్: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్, భట్టి పాల్గొనున్నారు. అలాగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి మున్షీ, పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లుగా మంత్రులు పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే సునీల్ కనుగోలు టీం సర్వేలు చేస్తోంది. కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

Updated Date - Jan 11 , 2024 | 08:21 AM