Share News

Asaduddin Owaisi: 15 సెకన్లు కాదు.. గంట తీస్కోండి

ABN , Publish Date - May 10 , 2024 | 06:23 AM

ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్‌ కౌర్‌కు గంట సమయం ఇవ్వండి.

Asaduddin Owaisi: 15 సెకన్లు కాదు.. గంట తీస్కోండి

  • ప్రధాని మీ వాళ్లే.. ఆర్‌ఎ్‌సఎస్‌ మీదే

  • మేం భయపడేది లేదు: ఎంపీ అసద్‌

  • నవనీత్‌ కౌర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : ఒవైసీ సోదరులను ఉద్దేశించి అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘‘15 సెకన్లు కాదు. నేను మోదీకి చెబుతున్నా.. నవనీత్‌ కౌర్‌కు గంట సమయం ఇవ్వండి. ఏం చేస్తారు మీరు..? ముఖ్తార్‌ అన్సారీ, పీలూ ఖాన్‌లను చంపినట్లు చంపేస్తారా..? మీలో మానవత్వం ఏమాత్రం ఉందో మేం కూడా చూడాలనుకుంటున్నాం..? మీకు భయపడేది లేదు. మేం సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలో మీ వాళ్లే ప్రధానిగా ఉన్నారు.

ఆర్‌ఎ్‌సఎస్‌ మీదే. అన్ని వ్యవస్థలూ మీ చేతుల్లో ఉన్నాయి. మీకు నచ్చింది చేయండి’’ అని అసద్‌ అన్నారు. మోదీ.. భారతీయ ముస్లింలను పాకిస్థానీలు అనుకుంటారని ఒవైసీ విమర్శించారు. చొరబాటుదారులని ముస్లింలకు ముద్ర వేశారని మండిపడ్డారు. ముస్లిం మహిళలు ఎక్కువగా పిల్లల్ని కంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అసద్‌ ధ్వజమెత్తారు.

Updated Date - May 10 , 2024 | 06:23 AM