Share News

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:24 AM

సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై కారును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు జోగిపేటకు చెందిన యువకులు ముకురం(22), హాజీ(26), వాజీద్(28)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 27 , 2024 | 09:30 AM