Share News

TS News: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:43 AM

విధి నిర్వహణ లో ఉన్నప్పుడే ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. గమ్య స్థానానికి చేరుకోక ముందే సదరు డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు కల్లూరు వచ్చీ రాగానే డ్రైవర్ కాకాని శ్రీనివాసరావు (45)గుండెపోటు వచ్చింది.

TS News: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఖమ్మం: విధి నిర్వహణ లో ఉన్నప్పుడే ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. గమ్య స్థానానికి చేరుకోక ముందే సదరు డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు కల్లూరు వచ్చీ రాగానే డ్రైవర్ కాకాని శ్రీనివాసరావు (45)గుండెపోటు వచ్చింది. దీంతో కల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బస్సును నిలిపివేసి చికిత్స పొందేందుకు ఆసుపత్రిలోకి వెళ్లాడు. చికిత్స పొందుతూనే శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచాడు. శ్రీనివాసరావు స్వస్థలం.. వేంసూరు మండలం రామన్నపాలెం.

Updated Date - Feb 15 , 2024 | 11:43 AM