Share News

KTR: కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:21 PM

ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామన్నారు.

KTR: కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది

ఖమ్మం: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని.. సమీక్షించుకుని ముందుకు సాగుతామని తెలిపారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు.

‘‘కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపిని తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించారు. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద జనం విశ్వాసాన్ని కోల్పోయారు. నాటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి ఇది రుజువైంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ వత్తిడి తెస్తోంది’’ అని కేటీఆర్ అన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 01:21 PM