Share News

Suicide: కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో దారుణం..

ABN , Publish Date - Jan 30 , 2024 | 08:35 AM

కరీంనగర్ జిల్లా: నగరంలోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్న విద్యార్థిని అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహాన్ని కాలేజీ ప్రిన్స్‌పాల్ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

Suicide: కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో దారుణం..

కరీంనగర్ జిల్లా: నగరంలోని కస్తూర్భా కాలేజీలో దారుణం జరిగింది. శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్న విద్యార్థిని అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహాన్ని కాలేజీ ప్రిన్స్‌పాల్ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాలేజీలో తమ కుమార్తెకు సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్షిత మృత దేహం మార్చురిలో ఉంది. విద్యార్థినిది జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, మేడంపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 30 , 2024 | 08:39 AM