Share News

Sangareddy: విద్యుత్‌ షాక్‌తో జేఎల్‌ఎం మృతి..

ABN , Publish Date - May 25 , 2024 | 04:56 AM

ల్‌సీ తీసుకొని విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లు సరిచేస్తుండగా కరెంట్‌ షాక్‌తో ఓ జూనియర్‌ లైన్‌మన్‌ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జున్‌పల్లిలో జరిగింది. సంగారెడ్డికి చెందిన బాల్‌రాజ్‌(22) జేఎల్‌ఎంగా మల్లికార్జున్‌పల్లిలో పనిచేస్తున్నాడు.

Sangareddy: విద్యుత్‌ షాక్‌తో జేఎల్‌ఎం మృతి..

మునిపల్లి, మే 24: ఎల్‌సీ తీసుకొని విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లు సరిచేస్తుండగా కరెంట్‌ షాక్‌తో ఓ జూనియర్‌ లైన్‌మన్‌ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జున్‌పల్లిలో జరిగింది. సంగారెడ్డికి చెందిన బాల్‌రాజ్‌(22) జేఎల్‌ఎంగా మల్లికార్జున్‌పల్లిలో పనిచేస్తున్నాడు. శివారు పొలాలకు సంబంధించి 11 కేవీ విద్యుత్‌ వైర్లలో ఇబ్బంది తలెత్తడంతో శుక్రవారం మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్‌ సరాఫరా కావడంతో షాక్‌తో స్తంభంపైనే చనిపోయాడు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని విద్యుత్‌ అధికారులు హామీ ఇచ్చారు. అయితే బాల్‌రాజ్‌ కరెంట్‌ షాక్‌కు గురై మరణించడం వెనుక ఆపరేటర్‌ తప్పా.. లేదా ఇంకేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది.

Updated Date - May 25 , 2024 | 04:56 AM