Share News

TS News: ఓయూలో గుండెపోటుతో విద్యార్థి మృతి

ABN , Publish Date - Jan 20 , 2024 | 10:01 AM

ఉస్మానియా యూనివర్సిటీలో చిరంజీవి అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఓయూ కామర్స్‌లో ఎంకామ్ పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ హాస్టల్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు.

TS News: ఓయూలో గుండెపోటుతో విద్యార్థి మృతి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో చిరంజీవి అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఓయూ కామర్స్‌లో ఎంకామ్ పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ హాస్టల్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు. చిరంజీవి గుండెపోటుతో బాధపడటాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిరంజీవి చనిపోయినట్టు గాంధీ వైద్యులు నిర్దారించారు.

Updated Date - Jan 20 , 2024 | 10:01 AM