Share News

TS Assembly: ఏడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 16 , 2024 | 10:30 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్‌ను మొదలుపెట్టారు.

TS Assembly: ఏడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly Session) ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) జీరో అవర్‌ను మొదలుపెట్టారు. కాగా.. పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

మరోవైపు ఈరోజు సభలో బీసీ కుల గణనపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టనుంది. అలాగే అసెంబ్లీలో ఇరిగేషన్‌పై సర్కార్‌ శ్వేత పత్రం విడుదల చేయనుంది. ఈరోజు ఇరిగేషన్‌పై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. ఇరిగేషన్‌పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న సభలో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. కాగ్ రిపోర్టులో కూడా కాళేశ్వరంపై అనేక ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు కాగ్ ప్రస్తావించింది. ఈరోజు ఇరిగేషన్ చర్చలో కాగ్ రిపోర్ట్ ప్రధాన అస్త్రంగా మారనుంది. మేడిగడ్డ కుంగిన విధానంపై ప్రభుత్వం సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 16 , 2024 | 10:38 AM