Home » TS Assembly
Telangana: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు.
Telangana: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పలువురు కవులు పాడిన పాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు సభలో వినిపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.
Telangana: సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో సాగు నీటి శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్ను మొదలుపెట్టారు.
Telangana: శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ను సిద్ధం చేసింది. డీపీఆర్లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.