Share News

Hyderabad: సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్..

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:17 PM

సంధ్యా థియేటర్‌లో జరిగిన సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. తాను రావడంతోనే ఈ ఘటన జరిగిందనడం అవాస్తమని ఆయన చెప్పారు.

Hyderabad:  సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్..
Icon star Allu Arjun

హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పారు. తాను రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనడం పూర్తి అవాస్తమని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు వెళ్లడం సహజమేనని, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తానూ ఊహించలేదని పోలీసులకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలోనూ తాను ఎన్నో సినిమాలకు రిలీజ్ సమయంలో థియేటర్ల వద్దకు వెళ్లానని చెప్పారు అల్లు అర్జున్. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన అన్నారు. గతంలో లాగే పుష్ప-2 సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్ వెళ్లానని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన వార్త చాలాసేపటి తర్వాత వ్యక్తిగత సిబ్బంది ద్వారా తెలిసిందని పోలీసులకు ఆయన వివరించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ పోలీసుల స్టేట్మెంట్‌లో చెప్పారు. కాగా, అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.


అల్లు అర్జున్ అరెస్టు..

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌ రిలీజ్ అయ్యింది. అయితే దానికి ముందు రోజు అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో ప్రీమియర్‌ షో నిర్వహించగా, ఆ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చారు. అయితే తమ అభిమాన నటుడు రావడంతో అతన్ని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళ ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితీ విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్‌, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై నమోదైంది. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు.


అయితే అల్లు అర్జున్‌ని అరెస్టు చేయలేదని, కేవలం విచారణ కోసం మాత్రమే పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీని నిందితుల్లో ఒకరిగా గుర్తించిన పోలీసులు బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. కాగా, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Updated Date - Dec 13 , 2024 | 02:48 PM