Share News

TS News: సికింద్రాబాద్‌లో 30 తులాల బంగారం చోరీ..

ABN , Publish Date - Jan 30 , 2024 | 07:26 AM

సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్‌లో ఓ ఇంట్లో 30 తులాల బంగారం చోరీకి గురైంది.

TS News: సికింద్రాబాద్‌లో 30 తులాల బంగారం చోరీ..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్‌లో ఓ ఇంట్లో 30 తులాల బంగారం చోరీకి గురైంది. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గ్రహించిన గుర్తు తెలియని దుండగులు తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు. బాధిత కుటుంబం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 07:26 AM