Share News

Charminar Express: నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:49 AM

Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కేసు నమోదు అయ్యింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మొత్తం మూడు బోగీలు అనగా ఎస్‌ 1, ఎస్‌ 2, ఎస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి.

Charminar Express: నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు

హైదరాబాద్, జనవరి 10: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కేసు నమోదు అయ్యింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మొత్తం మూడు బోగీలు అనగా ఎస్‌ 1, ఎస్‌ 2, ఎస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే అధికారులు పట్టాలు తప్పిన భోగిల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రత్యేక యంత్రాలు, జాకీల సహాయంతో బోగీల పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. దీంతో రైలు ప్రమాదంపై లోకో పైలట్‌ను విచారణ కమిటీ సభ్యులు విచారిస్తున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:49 AM