Share News

Accident: 3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

ABN , Publish Date - Mar 06 , 2024 | 08:42 AM

ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఓ ఫ్యామిలీ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరించింది.

Accident: 3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఓ ఫ్యామిలీ తిరుపతి (Tirupathi) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు బయలుదేరింది. ఆళ్లగడ్డ మండలానికి చేరుకునే సరికి డ్రైవర్‌ను నిద్ర మత్తు ఆవహించిందో లేదంటే అతి వేగం కారణంగానో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ఇక మృతులంతా హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లో గల వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవికుమార్, లక్ష్మీ, సాయికిరణ్, ఉదయ్ కిరణ్, కావ్య శ్రీగా గుర్తించారు. వీరిలో బాలకిరణ్, కావ్యలకు ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లైంది. ఈ నెల 3న షామీర్‌పేటలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. లక్ష్మి, రవికుమార్‌ వచ్చేసి.. బాలకిరణ్ తల్లిదండ్రులు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన వెంటనే స్విఫ్ట్ కారులో తిరుమల దైవదర్శనానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - Mar 06 , 2024 | 11:14 AM