Share News

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

ABN , Publish Date - May 24 , 2024 | 04:42 AM

విద్యా, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికిగాను శ్రీ రామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌ అవార్డు లభించింది. గురువారం లండన్‌లోని గిల్ట్‌హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

Hyderabad: దాజీకి ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌’ అవార్డు

హైదరాబాద్‌, నందిగామ, మే 23 (ఆంధ్రజ్యోతి): విద్యా, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికిగాను శ్రీ రామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌ అవార్డు లభించింది. గురువారం లండన్‌లోని గిల్ట్‌హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దాజీ అసలు పేరు కమలేశ్‌ పటేల్‌. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హాశాంతివనంలో నిర్వహిస్తున్న రామచంద్ర మిషన్‌ ద్వారా ప్రజలకు ఆయన సేవా చేస్తున్నారు. దాజీ ప్రపంచంలోని 160 దేశాల్లో గల రామచంద్ర మిషన్‌ హార్ట్‌ఫుల్‌ నెస్‌ సెంటర్లకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది సిటీ ఆఫ్‌ లండన్‌ అవార్డ్‌ ‘లండన్‌ నగర’ శక్తిని చాటిచెప్పే గొప్ప గౌరవంగా భావిస్తారు. ఈ సందర్భంగా కమలేశ్‌ పటేల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - May 24 , 2024 | 04:42 AM