Hyderabad: కాంగ్రెస్ నేత దారుణ హత్య.. ఉలిక్కిపడిన హైదరాబాద్!
ABN , Publish Date - May 04 , 2024 | 11:00 PM
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (TS Lok Sabha Polls) ముందు దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతను ఓ దుండగుడు అతి దారుణంగా హత్య చేసి చంపాడు.
హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (TS Lok Sabha Polls) ముందు దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతను ఓ దుండగుడు అతి దారుణంగా హత్య చేసి చంపాడు. హసన్నగర్లో కాంగ్రెస్ సభ జరుగుతుండగా ఒక్కసారిగా చొరబడిన దుండగుడు.. అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపేశాడు. కళ్ల ముందే ఈ ఘటన జరగడంతో సభా ప్రాంగణం నుంచి కార్యకర్తలు, జనాలు పరుగులు తీశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడింది. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ గొడవ జరగడానికి కారణమేంటి..? హత్య చేసిందెవరు..? చనిపోయిన వ్యక్తి ఎవరు..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఈ కేసులో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.