Watch Video: నాగోబా గోపురం శంకుస్థాపన చేసిన రేవంత్.. సీఎం క్రేజ్ చూశారా..!
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:44 PM
CM Revanth At Nagoba Temple: అవును.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రూపు రేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు..
![Watch Video: నాగోబా గోపురం శంకుస్థాపన చేసిన రేవంత్.. సీఎం క్రేజ్ చూశారా..!](https://media.andhrajyothy.com/media/2023/20231205/Revanth_Nagoba_d71fdb7a24.jpg)
అవును.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రూపు రేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్లతో నాగోబా దేవాలయ గోపురం, ఇతర అభివృద్ధి పనులను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు.. మరో రూ. 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను రేవంత్ సర్కార్ కేటాయించింది. అభివృద్ధి పనులు, నాగోబా గోపురం శంకుస్థాపనను లైవ్లో చూసేయండి..
సీఎం రేవంత్ రాకతో ఇంద్రవెల్లి.. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయింది. రేవంత్ను చూడగానే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా రేవంత్ క్రేజే వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆలస్యమెందుకు రేవంత్ క్రేజ్ ఎలా ఉందో వీడియోలో నేరుగా చూసేయండి..