Share News

TS NEWS: కేటీఆర్ ముందే గులాబీ కార్యకర్తల కొట్లాట.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 10 , 2024 | 05:05 PM

కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎదురుగానే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. సీనియర్ నాయకుడు కొమ్ముల తిర్మల్ రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS NEWS: కేటీఆర్ ముందే గులాబీ కార్యకర్తల కొట్లాట.. కారణమిదే..?

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎదురుగానే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. సీనియర్ నాయకుడు కొమ్ముల తిర్మల్ రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న నేతలందరి పేర్లు చెప్పి గంప గోవర్ధన్ పేరు చెప్పక పోవడంతో వేదిక పైకి కార్యకర్తలు దూసుకువచ్చారు. కేటీఆర్ ఎంత వారించినా వినకుండా గోవర్ధన్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు బాహాబాహికి దిగాయి. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 06:02 PM