Car Accident: సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
ABN , Publish Date - Jun 06 , 2024 | 02:59 PM
కంటోన్మెంట్ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.
![Car Accident: సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు](https://media.andhrajyothy.com/media/2024/20240604/accident_019c0d11ad.jpg)
సికింద్రాబాద్, జూన్ 06: కంటోన్మెంట్ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. ఆ తొందరలో డ్రైవర్.. కారును వేగంగా ముందుకు నడిపారు. అయితే మరోవైపు గ్రీన్ సిగ్నల్ పడడంతో మరో కారు ముందుకు వచ్చింది. దీంతో వేగంగా వచ్చిన కారు.. అడ్డు వచ్చిన కారును వేగంగా ఢీ కొట్టింది.
దాంతో కారు మూడు పల్టీలు కొట్టి.. డివైడర్ల మీదగా పక్కకు పడిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, వాహనాదారులు వెంటనే స్పందించి.. కారులోని ప్రయాణికులకు బయటకు తీశారు. ఇక ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమైనాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సికింద్రాబాద్ క్లబ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News