Share News

Miryalaguda: రైలు కింద పడి ఇద్దరి బలవన్మరణం..

ABN , Publish Date - May 31 , 2024 | 04:16 AM

వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, అవివాహితుడైన ఓ యువకుడు నెరిపిన బంధం.. వివాదాలు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ

 Miryalaguda: రైలు కింద పడి ఇద్దరి బలవన్మరణం..

  • విషాదం నింపిన వివాహేతర సంబంధం

మిర్యాలగూడ అర్బన్‌, మే 30: వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో కలహాలు సృష్టించింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, అవివాహితుడైన ఓ యువకుడు నెరిపిన బంధం.. వివాదాలు రేపింది. చివరకు ఆ ఇద్దరు రైలు కింద పడి చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ధనలక్ష్మి(22)కి అదే గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌కు చెందిన ఓవ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు.


ఈ క్రమంలో తమ నివాసానికి సమీపంలో ఉంటున్న అవివాహితుడైన దుర్గాప్రసాద్‌(19)తో ధనలక్ష్మికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ధనలక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరిగేవి. మూడు రోజుల క్రితం భర్త, పిల్లలను వదిలి ధనలక్ష్మి పుట్టిల్లు అయిన వెంకటాద్రిపాలెం వెళ్లింది. బుధవారం ఆమె దుర్గాప్రసాద్‌తో కలిసి ఊరి నుంచి వెళ్లిపోయింది. గురువారం ధనలక్ష్మి, దుర్గాప్రసాద్‌ మిర్యాలగూడ-కుక్కడం రైల్వే మార్గంలో ఐలాపురం వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తింపుకార్డుల ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.

Updated Date - May 31 , 2024 | 04:16 AM