Share News

Hyderabad: రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌ నియామకం

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:48 AM

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి (రిటైర్డ్‌), సభ్యులుగా ప్రదీప్‌ కుమార్‌రెడ్డి పల్లె (అడ్వకేట్‌, జ్యుడీషియల్‌ మెంబర్‌), రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిత్రారామచంద్రన్‌

Hyderabad: రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌ నియామకం

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి (రిటైర్డ్‌), సభ్యులుగా ప్రదీప్‌ కుమార్‌రెడ్డి పల్లె (అడ్వకేట్‌, జ్యుడీషియల్‌ మెంబర్‌), రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిత్రారామచంద్రన్‌ (టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ మెంబర్‌)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అఽథారిటీ(రెరా) చైర్మన్‌ ఎన్‌.సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, జె.లక్ష్మీనారాయణ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌ పర్సన్‌, సభ్యులతో రెరా చైర్మన్‌, సభ్యులు సమావేశమై చర్చించారు.

Updated Date - Jun 10 , 2024 | 05:48 AM