Share News

Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. అదే కారణమా

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:43 PM

రాష్ట్ర బీజేపీకి(BJP) బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. అదే కారణమా

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి(BJP) బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ నివాసానికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వచ్చారు.

సీఎంతో చర్చల అనంతరం కాంగ్రెస్‌లోకి రావడానికి జితేందర్ సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్‌నిస్తూ ఆ టికెట్‌ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 04:03 PM