ప్రీక్వార్టర్స్కు సాత్విక్ జోడీ
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:55 AM
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముందంజ వేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో టాప్సీడ్ సాత్విక్ జంట 21–18, 2–14తో మహ్మద్ ఎహ్సాన్/హెండ్రా సెతివాన్ ద్వయాన్ని చిత్తుచేసి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది.
• లక్ష్యసేన్, అశ్విని జంట ముందంజ
• ప్రియాన్షు ఇంటికి
• ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముందంజ వేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో టాప్సీడ్ సాత్విక్ జంట 21–18, 2–14తో మహ్మద్ ఎహ్సాన్/హెండ్రా సెతివాన్ ద్వయాన్ని చిత్తుచేసి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది. సింగిల్స్లో లక్ష్యసేన్ 21–14, 21–14తో మాగ్నస్ జోహన్నెసెన్ (డెన్మార్క్)పై, మహిళల డబుల్స్లో అశ్విని/తనీషా జోడీ 21–13, 21–18తో యెంగ్ టింగ్–యెంగ్ పుయి లామ్ (హాంకాంగ్పై) గెలిచి ప్రీక్వారర్స్కు దూసుకెళ్లారు. కాగా, యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ 19–21, 21–11, 9–21తో చికో వార్డోయో (ఇండోనేసియా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.