Share News

Viral: 12 ఏళ్ల పాటు లాటరీ టిక్కెట్లు కొన్న మహిళకు జాక్ పాట్.. ఎంత గెలిచిందో తెలిస్తే..

ABN , Publish Date - May 20 , 2024 | 05:15 PM

పన్నెండేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్న ఓ మహిళ చివరకు అనుకున్నది సాధించింది. భారీ జాక్ పాట్ తగలడంతో రాత్రికి రాత్రి సంపన్నురాలిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: 12 ఏళ్ల పాటు లాటరీ టిక్కెట్లు కొన్న మహిళకు జాక్ పాట్.. ఎంత గెలిచిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: పన్నెండేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్న ఓ మహిళ చివరకు అనుకున్నది సాధించింది. భారీ జాక్ పాట్ తగలడంతో రాత్రికి రాత్రి సంపన్నురాలిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఘటన ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. సహనంతో అదృష్ఠాన్ని దక్కించుకున్న మహిళకు జనాలు అభినందనలు చెబుతున్నారు.

Viral: రెండేళ్లుగా బాయ్‌ఫ్రెండ్‌తో అద్దె ఫ్లాట్‌లో యువతి.. సీక్రెట్‌గా అతడు చేసేదేంటో తెలిసి..

పంజాబ్ కు చెందిన పాయల్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన ప్రతిసారీ డ్యూటీ ఫ్రీ దుబాయ్ మిలీనియం మిలియనీర్ డ్రా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటుంది. ప్రతిసారీ ఎయిర్‌పోర్టులో టిక్కెట్లు కొనే ఆమె ఈ సారి మాత్రం కాస్తంత భిన్నంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్టు కొనింది. అంతకుమునుపు, తమ పెళ్లి రోజు సందర్భంగా భర్త బహుమతిగా ఇచ్చిన డబ్బుతో టిక్కెట్టు కొనింది. ఆమె అదృష్ట అంకె మూడు కావడంతో అది అధికసార్లు ఉన్న సంఖ్యను ఎంచుకుంది. కానీ ఇటీవల ఆమె ఏకంగా రూ.8 కోట్లు గెలుచుకున్నట్టు లాటరీ నిర్వాహకుల నుంచి ఫోను రావడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.


అంతడబ్బును ఏం చేయబోతున్నారని మీడియా ప్రశ్నించగా ఇంకా ఏమీ ఆలోచించుకోలేదని పాయల్ పేర్కొంది. అయితే, మొదట తమ పిల్లల భవిష్యత్తుకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. మిగతా మొత్తంలో కొంత సమాజసేవకు కూడా వినియోగిస్తామని చెప్పింది. కాగా, డీడీపీ ఎఫ్ చరిత్రలో డీడీఎఫ్ ప్రైజ్ గెలుచుకున్న 229వ భారతీయ వ్యక్తిగా పాయల్ రికార్డు సృష్టించింది.

Read Viral and Telugu News

Updated Date - May 20 , 2024 | 05:15 PM