Share News

Viral: 8 మంది ఉన్న ఫ్యామిలీ.. హోటల్‌లో ఫుల్లుగా మెక్కి రూ.34 వేల బిల్లు చేసి..ఆపై..

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:00 PM

ఎనిమిది మంది సభ్యులున్న కుటుంబం ఓ రెస్టారెంట్‌లో బాగా తిని రూ. 34 వేల బిల్లు కట్టకుండా జంపైపోయిన ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది.

Viral: 8 మంది ఉన్న ఫ్యామిలీ.. హోటల్‌లో ఫుల్లుగా మెక్కి రూ.34 వేల బిల్లు చేసి..ఆపై..

ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిది మంది సభ్యులున్న కుటుంబం ఓ రెస్టారెంట్‌లో బాగా తిని రూ. 34 వేల బిల్లు కట్టకుండా జంపైపోయిన ఘటన బ్రిటన్‌లో (UK) వెలుగు చూసింది. ఘరానా ఫ్యామిలీ దెబ్బకు షాకైపోయిన ఆ రెస్టారెంట్ యాజమాన్యం.. వారిని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసింది. వారి ఫొటోను కూడా నెట్టింట పంచుకుంది.

Viral: మెట్రో స్టేషన్‌లో ప్రయాణికురాలికి ఊహించని అనుభవం.. వెనకున్న ప్రయాణికుడు సడెన్‌గా..


రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపణల ప్రకారం, తొలుత ఆ కుటుంబం ఫుల్లుగా తినేసింది. వారిలో ఓ మహిళ తన కార్డుతో బిల్లు చెల్లించేందుకు ప్రయత్నించగా ఆమె అకౌంట్‌లో బ్యాలెన్స్ లేని కారణంగా కార్డు తిరస్కరణకు గురైంది. మరో కార్డు తీసుకొస్తానని చెప్పి తన కొడుకును అక్కడే ఉంచి ఆమె బయటకు వచ్చేసింది. కాసేపటికి కుమారుడు కూడా అదే ట్రిక్ ప్లే చేశాడు. తాను అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడాలంటూ అక్కడి నుంచి జంపైపోయాడు. ఇలా కుటుంబం మొత్తం మస్కా కొట్టి చల్లగా జారుకుంది.

దీంతో, రెస్టారెంట్ ఆ కుటుంబాన్ని తిట్టిపోస్తూ వారి ఫొటో కూడా షేర్ చేసింది. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలంటూ మండిపడింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 10:32 PM