Telangana Talli Statue: ధూంధాంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
ABN, Publish Date - Dec 10 , 2024 | 07:31 AM
తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉద్విగ్న భరితమైన వాతావరణంలో జరిగింది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు.. హుస్సేన్ సాగర తీరాన.. రాష్ట్ర సచివాలయంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది.
1/8
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ప్రజాపాల విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
2/8
వేలమంది మహిళల మధ్య, వేద మంత్రోచ్ఛరణల నడుమ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
3/8
వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వేదికపై ప్రదర్శించిన పేరణి నృత్యం, భరత నాట్యం, జయజయహే, ప్రజాపాలన, తెలంగాణ అభివృద్థి సంక్షేమ గీతాలు అలరించాయి.
4/8
డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను, ‘తెలంగాణ రైజింగ్’ లోగోను కూడా ప్రదర్శించారు.
5/8
విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది సర్కార్. సంగీత కచేరీలతో పాటు, కళాకారులు ఆటపాటలతో అందరినీ అలంరించాయి.
6/8
ఐమాక్స్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో ఎస్ ఎస్ థమన్తో 7 గంటల నుంచి 8.30 గంటల వరకు సంగీత కచేరీ జరిగింది.
7/8
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటెయిన్ కూడా నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
8/8
కళాకారులు పాడిన పాటలు వేశేషంగా ఆకట్టుకున్నాయి.
Updated at - Dec 19 , 2024 | 11:45 AM