Raksha Bandhan: సీఎం రేవంత్కి సీతక్క సహా పలువురు మహిళా నేతల రాఖీలు
ABN, Publish Date - Aug 19 , 2024 | 12:55 PM
తెలంగాణ అంతటా రాఖీ పండుగ జరుగుతోంది. తోబుట్టువులకు రాఖీలు కట్టేందుకు మహిళలు తమ సోదరుల దగ్గరకి తరలి వెళ్తున్నారు. మరోవైపు రాజకీయ వర్గాల్లోనూ రాఖీ సందడిగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క సహా పలువురు మహిళా నేతలు రాఖీలు కట్టారు. దీంతో సీఎం నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
1/7
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క. కాగా ప్రతి ఏడాది ఆమె రేవంత్కి రాఖీ కడుతుంటారు
2/7
రాఖీ సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్బంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
3/7
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన మంత్రి సీతక్క. మనువడిని ఎత్తుకుని సంతోషంగా కనిపించిన సీఎం
4/7
రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ
5/7
రాఖీ పండుగను పురస్కరించుకుని కోకాపేట్లోని ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా నేతలు
6/7
రాఖీ కట్టి హరీష్ రావుకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మహిళలు
7/7
ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులు అందరికీ మాజీ మంత్రి హరీశ్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
Updated at - Aug 19 , 2024 | 01:41 PM