Warangal: అట్టహాసంగా నరకాసుర వధ
ABN, Publish Date - Oct 31 , 2024 | 10:55 AM
కరీమాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట కుడా మైదానంలో బుధవారం నరకాసుర వధ కన్నుల పండువగా సాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అద్యంతం వైభవంగా కొనసాగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, భద్రం దేవాలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
1/6
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట కుడా మైదానంలో బుధవారం నరకాసుర వధ కన్నుల పండువగా సాగింది.
2/6
వరంగల్ ఊర్సుగుట్ట వద్ద నరకాసుర వధ.. అలరించిన ప్రత్యేక బాణసంచా విన్యాసాలు..
3/6
నరకాసుధ వధ ఘట్టం.. ప్రత్యేక బాణసంచా వెలుగులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి...
4/6
ఉర్సు గుట్ట వద్ద జరిగిన ఉత్సవానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..
5/6
కళ్లు చెదిరేలా.. ఘనంగా నిర్వహించిన ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ వేడుకలు..
6/6
ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ వేడుకలు.. కిక్కిరిసిపోయిన గుట్ట మైదానం..
Updated at - Oct 31 , 2024 | 10:55 AM