వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ సంబురాలు
ABN, Publish Date - Oct 03 , 2024 | 02:02 PM
హనుమకొండ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు, పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా హనుమకొండ జిల్లా వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. మహిళలు వేయిస్తంభాల దేవాలయం వద్దకు భారీగా తరలివచ్చి ఆడిపాడారు.
1/5
హనుమకొండ జిల్లా.. వేయిస్తంభాల దేవాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.
2/5
బతుకమ్మ సంబరాలు చేసుకునేందుకు వేయిస్తంభాల దేవాలయం వద్దకు భారీగా తరలివచ్చిన మహిళలు..
3/5
వేయి స్తంభాల గుడివద్ద బతుకమ్మలను ఒక చోట పేర్చి పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తున్న మహిళలు..
4/5
హనుమకొండ నగరంలోని మహిళలంతా వేయి స్తంభాల దేవాలయం వద్దకు చేరుకుని బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న దృశ్యం..
5/5
వేయిస్తంభాల దేవాలయం వద్ద బందోబస్తుకు వచ్చిన మహిళా పోలీసులు కూడా బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆడి పాడారు..
Updated at - Oct 03 , 2024 | 02:02 PM