Share News

Vande Bharat Trains: వందే భారత్‌ రైళ్లలో ఇకపై 500 ఎంఎల్‌ వాటర్‌ బాటిళ్లు

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:34 PM

వందే భారత్‌ రైళ్లలో ప్రయాణికులకు ఇకపై 500 మి.లీ వాటర్‌ బాటిళ్లు అందించనున్నట్టు రైల్వే బోర్డు(Railway Board) అధికారులు తెలిపారు.

Vande Bharat Trains: వందే భారత్‌ రైళ్లలో ఇకపై 500 ఎంఎల్‌ వాటర్‌ బాటిళ్లు

చెన్నై: వందే భారత్‌ రైళ్లలో ప్రయాణికులకు ఇకపై 500 మి.లీ వాటర్‌ బాటిళ్లు అందించనున్నట్టు రైల్వే బోర్డు(Railway Board) అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రయాణికులకు లీటరు రైల్‌ నీర్‌ బాటిల్‌ను ఉచితంగా అందిస్తుండగా, కొందరు ప్రయాణికులు సగం తాగిన బాటిళ్లను చెత్తకుండీలో పడేస్తున్నారు. నీరు వృఽథా కావడాన్ని అడ్డుకొనేలా ఇకపై అర లీటర్‌ బాటిళ్లు అందజేయాలని అన్ని మండల మేనేజర్లకు రైల్వే బోర్డు సర్క్యులర్‌ పంపింది. అవసరమైతే ఉచితంగా మరో బాటిల్‌ అందించాలని సూచించింది.

Updated Date - Feb 08 , 2024 | 01:34 PM